న్యూఢిల్లీః ఐపీఎల్ 2020 ముగియగానే ఇండియా ఆస్ట్రేలియా టూర్కు వెళ్లనుంది. డిసెంబరు 3 న భారత్-ఆసీస్ మధ్య మొదటి టెస్ట్ జరగనుంది. అయితే కరోనా నిబంధనల ప్రకారం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టే వారు ఖచ్చితంగా 14 రోజుల క్వారంటైన్ లో ఉండాలి. కానీ బీసీసీఐ కు మాత్రం అలా 14 రోజులు వృధా చేయడం ఇష్టం లేదు. అందుకే క్వారంటైన్ లో ఉన్నప్పుడు కూడా ఆటగాళ్లకు ప్రాక్టీస్ చేసే అవకాశాన్ని కల్పించాలి అని షరతులు విధించింది. కానీ క్రికెట్ ఆస్ట్రేలియా మాత్ర అందుకు ఒప్పుకోవడం లేదు. ఆటగాళ్లు బయటకు రాకుండా 14 రోజులు ఉండాల్సిందే అంటుంది. ప్రస్తుతం ఇదే విషయంపై రెండు దేశాల క్రికేట్ బోర్డుల మధ్య వివాదం నడుస్తోంది. మ్యాచ్ లు అన్ని వాయిదా పడటంతో సీఏ బాగా నష్టపోయింది. అందువల్ల ఈ బోర్డు కు భారత్ తో ఆడే మ్యాచ్ లు చాలా ముఖ్యం.