తిరుపతి తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ తొక్కిసలాట కారణం భక్తులే.. వాళ్ళంతట వాళ్లే పడిపోయారు ఇందులో టీటీడీ వైఫల్యం ఏమి లేదు అని చింతా మోహన్ అన్నారు. తిరుమలలో తొక్కిసలాట జరగలేదు గంటల తరబడి ప్రయాణం చేసి ఏమి తినకుండా ఆకలితో భక్తులు లైన్లో నిలబడ్డారు దాని వల్ల బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయారు అని కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్ తెలిపారు.