Homeజాతీయంభారత్​బంద్​: జాతీయ రహదారుల దిగ్బంధం

భారత్​బంద్​: జాతీయ రహదారుల దిగ్బంధం

న్యూఢిల్లీ: వ్యవసాయ బిల్లులకు నిరసనగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న ‘భారత్​ బంద్’​ విజయవంతంగా సాగుతోంది. పలు రాష్ట్రాల్లో జన జీవనం అస్తవ్యస్తమయ్యింది. అంతరాష్ట్ర రైలు సర్వీసులు నిలిచిపోయాయి. ప్రజా రవాణా ఎక్కడికక్కడ నిలవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రైతుల ధర్నాతో ఢిల్లీ–హర్యానా నేషనల్​ హైవే దాదాపుగా మూతపడింది. పంజాబ్​లో జాతీయ రహదారులపై అక్కడి రైతులు బైటాయించడంతో వాహనాలు కిలోమీటర్ల కొద్ది బారులు తీరాయి.
ప్రతిపక్షాలు, రైతు సంఘాల పిలుపు
వ్యవసాయ బిల్లులకు నిరసనగా కాంగ్రెస్​, తృణమూల్​ కాంగ్రెస్​, ఆమ్​ ఆద్మీపార్టీ, ద్రావిడ మున్నెట్రా కజహ్గం, రాష్ట్రీయ జనతా దళ్​తోపాటు 18 ప్రతిపక్ష పార్టీలు దేశ వ్యాప్తంగా ‘భారత్​ బంద్​’కు పిలునిచ్చిన విషయం తెలిసిందే. వీరితోపాటు భారతీయ కిసాన్​ యూనియన్​(బీకేయూ), అల్​ ఇండియా ఫార్మర్స్ యూనియన్​(ఏఐఎఫ్​యూ), అల్​ ఇండియా కిసాన్​ సంఘర్ట్​ కోఆర్డినేషన్​ కమిటీ(ఏఐకేఎస్సీసీ), అల్​ ఇండియా కిసాన్​ మహాసంఘ్​(ఏఐకేఎం)లు ప్రత్యక్షంగా బంద్​లో పాల్గొంటున్నాయి.
బంద్​తో ప్రభావితమైన రాష్ట్రాలు
హర్యానా, పంజాబ్​, మహారాష్ట్ర, ఉత్తర్​ప్రదేశ్​, మధ్యప్రదేశ్​, కర్ణాటక, చత్తిస్​ఘడ్​, వెస్ట్​ బెంగాల్​, ఉత్తరాఖండ్​.. మిగతా రాష్ట్రాల్లో భారత్​ బంద్​ ప్రభావం పాక్షికంగా ఉంది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img