బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కరీంనగర్ లో బీఆర్ఎస్ నేతలు పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రివర్ ఫ్రంట్, స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి జరిగిందన్నారు. సునీల్ రావు కామెంట్లపై ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపడ్డారు. సునీల్ అత్యంత అవినీతిపరుడని, ఐదేళ్లలో రూ.కోట్లు సంపాదించారని ఆరోపణలు గుప్పించారు. కాగా సునీల్ రావు ఇవాళ బీజేపీలో చేరనున్నారు.