మంచు ఫ్యామిలీలో గొడవ తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశం అవుతోంది. గత కొంత కాలంగా మోహన్ బాబు కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తలంపై నెగటివ్ ప్రచారం జరుగుతుంది.ఈ విషయంపై మంచు మోహన్ బాబు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ఫోటోలు, వాయిస్ను గూగుల్లో, సోషల్ మీడియాలో వాడొద్దని ఢిల్లీ హైకోర్టులో మోహన్ బాబు పిటిషన్ దాఖలు చేసాడు. మోహన్ బాబు కంటెంట్ను గూగుల్ నుంచి తొలగించాలని ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది.