ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కి భారీ షాక్ తగిలింది. తాజాగా జనసేన పార్టీలో ఇద్దరు వైసీపీ నేతలు చేరారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో మాజీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, ఆప్కో మాజీ ఛైర్మన్ గంజి చిరంజీవి జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. వారిని పవన్ కళ్యాణ్ సైతం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.