Homeతెలంగాణbjp:మహిళా రిజర్వేషన్ల విషయంలో బీజేపీ మోసం

bjp:మహిళా రిజర్వేషన్ల విషయంలో బీజేపీ మోసం

– బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కవిత
– బీజేపీ స్టేట్​ చీఫ్​ కిషన్​ రెడ్డికి కౌంటర్​
ఇదేనిజం, హైదరాబాద్​: మహిళా రిజర్వేషన్ల విషయంలో బీజేపీ మోసం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. గతంలో మహిళా రిజర్వేషన్​ బిల్లు కోసం ఆమె ఢిల్లీలో పోరాటం చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సీఎం కేసీఆర్​ ప్రకటించిన ఫస్ట్​ లిస్టులో కేవలం ఏడు స్థానాలే కేటాయించడంపై బీజేపీ స్టేట్​ చీఫ్​ కిషన్​ రెడ్డి విమర్శలు గుప్పించారు. దీనికి ఎమ్మెల్సీ కవిత మంగళవారం కౌంటర్​ ఇచ్చారు. ‘‘మహిళా రిజర్వేషన్లపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 2 సార్లు మోసం చేసింది. సంఖ్యాబలం ఉన్నా బీజేపీ మహిళా బిల్లును ఎందుకు ఆమోదించట్లేదు? చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల బిల్లును బీజేపీ తీసుకురావాలి. చట్టం ఉన్నందునే స్థానిక సంస్థల్లో 14 లక్షల మంది మహిళలకు ప్రాతినిధ్యం దక్కింది. మీ రాజకీయ అభద్రతను మహిళా ప్రాతినిధ్యానికి ముడి పెట్టొద్దు’’ అంటూ కవిత మండిపడ్డారు.

Recent

- Advertisment -spot_img