BJP:బీజేపీ కీలక నిర్ణయాలు తీసుకుంది .బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ని అధిష్టానం నియమించింది . ఈ మేరకు జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శి పేరిట అరుణ్ సింగ్ పెఉత్తర్వులు జరీ చేశారు . తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి సంజయ్ను తొలగించింది. కొత్తగా అధ్యక్ష బాధ్యతలను కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి అప్పగించారు. ఇటీవల బండి సంజయ్కు వ్యతిరేకంగా బీజేపీ నాయకుల ఫిర్యాదులు చేయడంతో జాతీయ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నది . మార్పుల్లో భాగంగా ఈటల రాజేందర్ కు కీలక బాధ్యతలు అప్పగించింది . ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఈటల కు బాధ్యతలు అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని నియమించారు. పంజాబ్ బీజేపీ అధ్యక్షుడిగా సునీల్ జక్కర్ , జార్ఖండ్ బీజేపీ చీఫ్ గా బాబూలాల్ మరాండి , జాతీయ కార్యవర్గంలోకి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డిని నియమించారు . జాతీయ అధ్యక్షుడు నడ్డాను బండి సంజయ్ కలిశారు