Homeఫ్లాష్ ఫ్లాష్Bjp Bandi sanjay:తెలంగాణలో సింగిల్ గా పోటీ చేస్తాం:ఎంపీ బండి సంజయ్

Bjp Bandi sanjay:తెలంగాణలో సింగిల్ గా పోటీ చేస్తాం:ఎంపీ బండి సంజయ్

బీఆర్ఎస్ నేతల ఆగడాలతో ప్రజలు విసిగిపోయారు

జాకీ పెట్టి లేపినా కాంగ్రెస్ లేచే పరిస్థితి లేదు

మీడియా బ్రేకింగులు పట్టించుకోవద్దు… అమిత్ సభను సక్సెస్ చేసి సత్తా చూపండి

Bjp Bandi sanjay:తెలంగాణలో అసలు కాంగ్రెస్ పార్టీ యాడుంది? కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా దేశంలో ఎక్కడా ఆ పార్టీ లేదు.. జాకీ పెట్టి లేపినా కాంగ్రెస్ పార్టీ లేవదు.. కమ్యూనిస్టుల పనైపోయింది. సూది దబ్బడం పార్టీలని అవమానించిన కేసీఆర్ పంచనే చేరిన సిగ్గు, శరంలేని పార్టీల నేతలు కమ్యూనిస్టులు’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. బండి సంజయ్ అధ్యక్షతన ఈరోజు పట్టణంలోని వాసిరెడ్డి ఫంక్షన్ హాలులో ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, జిల్లాల సమావేశం జరిగిందిరాష్ట్రంలో పెరుగుతున్న బీజేపీ గ్రాఫ్ ను తగ్గించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతోపాటు ఓ సెక్షన్ మీడియా కుట్ర చేస్తోందన్నారు. ఎవరెంత దుష్ప్రచారం చేసినా పట్టించుకోవద్దని కార్యకర్తలకు సూచించారు. బీజేపీ సింహంలాంటి పార్టీ అని, తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేసి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు.. ఏదీ చేతగాని నపుంసకుడు పెళ్లి చేసుకుంటే ఏమైతది… కాంగ్రెస్ పరిస్థితి కూడా అట్లనే ఉందన్నారు.బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఓ సెక్షన్ మీడియా బీజేపీ గ్రాఫ్ ను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నయ్. కర్నాటక ఫలితాలను బూచీగా చూపి బీజేపీ పనైపోయిందని దుష్ప్రచారం చేస్తోంది. బీజేపీ కార్యకర్తలెవరూ పట్టించుకోవద్దు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని భరోసా ఇచ్చారు.నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీ తెలంగాణలో సింగిల్ గా పోటీ చేస్తాం. గెలిచి సింగిల్ గానే అధికారాన్ని కైవసం చేసుకుంటాం. మీడియాలో బ్రేకింగుల పేరిట జరుగుతున్న షేకింగులను పట్టించుకోవద్దు. అందరూ కష్టపడి ఇష్టపడి పనిచేసి కాషాయ రాజ్య స్థాపనకు క్రుషి చేయాలి. అందులో భాగంగా 15న జరిగే సభను విజయవంతం చేయాలి.

Recent

- Advertisment -spot_img