అస్సాంలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో ఎన్డీయే హవా కొనసాగుతోంది. బెహలీ, ఢోలై, శామాగురిలో బీజేపీ, సిద్లీలో యూపీపీఎల్, బోంగైగావ్లో అస్సాం గణపరిషత్ విజయం సాధించింది. 25 ఏళ్లుగా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న శామాగురిలో బీజేపీ గెలుపుపై సీఎం హిమంత బిశ్వశర్మ హర్షం వ్యక్తం చేశారు.