బెంగళూరు నియోజకవర్గం నుంచి ఎన్నికైన బీజేపీ ‘యంగ్ అండ్ ఎనర్జిటిక్’ ఎంపీ తేజస్వి సూర్య ప్రముఖ సెలబ్రిటీ ని పెళ్లి చేసుకోనున్నాడు. తేజస్వి సూర్య పెళ్లి ఖాయం కాగా, చెన్నైకి చెందిన సింగర్ శివశ్రీని పెళ్లి చేసుకోనుందని వార్తలు వచ్చాయి. 2025 మార్చి 4న పెళ్లి జరగనుందని అంటున్నారు.. అయితే దీనిపై సూర్య అధికారిక ప్రకటన చేయలేదు. తేజస్వి సూర్య, శివశ్రీ స్కంద ప్రసాద్ల ఇరు కుటుంబాలు ఇప్పటికే చర్చలు జరిపి పెళ్లికి అంగీకరించారని, దాని ప్రకారం మార్చి 4న బెంగళూరులో వివాహం జరగనుందని సమాచారం. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
శివశ్రీ స్కంద ప్రసాద్ కర్ణాటక సంగీత గాయకురాలు మాత్రమే కాదు, భరతనాట్య కళాకారిణి కూడా. ఆమె శాస్త్ర విశ్వవిద్యాలయం నుండి బయో ఇంజినీరింగ్లో B.Tech కలిగి ఉన్నారు మరియు చెన్నై విశ్వవిద్యాలయం నుండి భరతనాట్యంలో MA మరియు చెన్నై సంస్కృత కళాశాల నుండి సంస్కృతంలో MA చదివారు. “పొన్నియిన్ సెల్వన్ – పార్ట్ 2” కన్నడ వెర్షన్లోని ఒక పాటకు కూడా ఆమె తన గాత్రాన్ని అందించింది.