Homeహైదరాబాద్latest Newsజనసేన పార్టీలో చేరనున్న.. బొత్స సత్యనారాయణ ?

జనసేన పార్టీలో చేరనున్న.. బొత్స సత్యనారాయణ ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ 11 స్థానాలకే పరిమితమైనందున… వైసీపీని వీడేందుకు పలువురు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే బాలినేని శ్రీనివాస రెడ్డి, సామినేని వంటి కీలక నేతలు జనసేనలోకి జంప్ అయ్యారు.
తాజాగా బొత్స సత్యనారాయణ కూడా అదే దారిలో వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీలు మారుతూ… పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించడంలో బొత్స సత్యనారాయణను మించిన వారు లేరు. కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలో చేరిన బొత్స ఇప్పుడు మళ్లీ పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారు. అతి త్వరలో బొత్స సత్యనారాయణ జనసేన పార్టీలో చేరతారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను నిజం చేస్తూ… బొత్స సత్యనారాయణ తన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకున్నారు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Recent

- Advertisment -spot_img