Homeహైదరాబాద్latest Newsభారీ వర్షాలకు బ్రెజిల్ అతలాకుతలం.. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

భారీ వర్షాలకు బ్రెజిల్ అతలాకుతలం.. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

భారీ వర్షాలకు బ్రెజిల్ అతలాకుతలం అయ్యింది. ఎన్నడూ చూడని డిజాస్టర్ గా బ్రెజిల్ వాతావరణ అధికారులు పేర్కొన్నారు. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రం రియో గ్రాండే డుసుల్ ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగి పడటంతో 37 మంది మృతి చెందారు. అలాగే సుమారు 74 మంది గల్లంతు అయ్యారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో రెస్య్కూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇండ్లు, బ్రిడ్జ్‌లు కూలిన ప్ర‌దేశాల్లో శిథిలాల‌ను తొల‌గిస్తున్నారు. విచిత్ర వెద‌ర్ వ‌ల్ల ప‌రిస్థితులు అదుపు త‌ప్పిన‌ట్లు ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఎడూర్డో లీట్ తెలిపారు. రాష్ట్రంలో ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించారు. ప్ర‌భావ‌త ప్రాంతాల‌కు సాయాన్ని అందించ‌నున్న‌ట్లు అధ్య‌క్షుడు లుజ్ ఇనాసియో లులా డ సిల్వా తెలిపారు.

Recent

- Advertisment -spot_img