Homeహైదరాబాద్latest NewsBREAKING: ఏపీ మంత్రి మాటల దాడి.. ఎక్స్‌లో బ్లాక్ చేసిన కేటీఆర్.. అసలు ఏం జరిగిందంటే..?

BREAKING: ఏపీ మంత్రి మాటల దాడి.. ఎక్స్‌లో బ్లాక్ చేసిన కేటీఆర్.. అసలు ఏం జరిగిందంటే..?

ఏపీ మంత్రి సత్యకుమార్ సెటైర్లు వల్ల తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్‌లో బ్లాక్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ ఎన్నికల్లో జగన్ ఓటమి, ధర్మవరంలో కేతిరెడ్డి ఓడిపోవడంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి సత్యకుమార్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. దాంతో ఆయన ఎక్స్ అకౌంట్‌ను కేటీఆర్ బ్లాక్ చేసేశారు.

మంత్రి సత్యకుమార్ ఏమన్నారంటే..‘‘ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓటమి పై తెలంగాణా మాజీ మంత్రి కేటీఆర్ చిలక పలుకులు పలుకుతున్నారు.. ధరణి పేరుతో తెలంగాణలో మీరు నడిపిన భూమాఫియా లాగానే ధర్మవరంలో గుడ్ మార్నింగ్ పేరుతో మీ భూభకాసుర మిత్రుడు ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేటు, ప్రజలు ఆస్తులను ఆక్రమించాడు. చివరికి చెరువులు కొండలను కూడా కబళించాడు. గుడ్ మార్నింగ్ అంటే ప్రజలకు గుర్తుకు వచ్చేది కబ్జా-కలెక్షన్-కరప్షన్-కమీషన్లే. ఫాంహౌస్‌కు పరిమితమైన మీరు ఎక్స్‌లో అడిగినా ధర్మవరం ప్రజలు సమాధానం చెబుతారు. మీ అవినీతిని ప్రశ్నిస్తూ నిర్మాణాత్మక విమర్శ చేసినందుకు ట్విట్టర్‌లో నాలుగు సంవత్సరాల క్రితం నన్ను బ్లాక్ చేశారు. ఈ అవినీతి, అహంకారం, అసమర్థతే మిమ్మల్ని మీ ప్రియ మిత్రులు జగన్ కేతిరెడ్డిలను ఓడించాయి. ఒకే జాతి పక్షులు ఒకరికొకరు ‘సర్టిఫికేట్’ లు ఇచ్చుకుంటూ ఓదార్చుకోండి’’ అంటూ ఏపీ మంత్రి సత్యకుమార్ ట్వీట్ చేశారు.

Recent

- Advertisment -spot_img