విద్యుత్ కొనుగోళ్ల అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్పై హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ వేశారు. కమిషన్ను రద్దు చేయాలని అందులో పేర్కొన్నారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటు జరిగిందని ఆరోపించారు. నర్సింహారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.