Homeహైదరాబాద్latest NewsBREAKING: భారీగా విరిగిపడిన కొండచరియలు.. శిథిలాల కింద చిక్కుకున్న వందలాది మంది.. 43కి చేరిన మృతుల...

BREAKING: భారీగా విరిగిపడిన కొండచరియలు.. శిథిలాల కింద చిక్కుకున్న వందలాది మంది.. 43కి చేరిన మృతుల సంఖ్య

కేరళలో భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. వయనాడ్ జిల్లా మెప్పాడి సమీపంలోని వివిధ కొండ ప్రాంతాల్లో ప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయి. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నట్లు సమాచారం. కేరళ విపత్తు నిర్వహణ సంస్థ, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షాల కారణంగానే కొండ చరియలు విరిగిపడినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 43 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. శిథిలాల కింద వందల సంఖ్యలో ప్రజలు చిక్కుకున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు సజీవ సమాధి అయినట్లు తెలుస్తోంది. భారీ వర్షం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.

Recent

- Advertisment -spot_img