బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. నేడు హైదరాబాద్లోని పోచారం ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఆయనను కాంగ్రెస్లో చేరాలని ఆహ్వానించడమే కాకుండా, మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని సమాచారం. ఈ విజ్ఞప్తిపై పోచారం సానుకూలంగా స్పందించారని వినికిడి. చంద్రబాబు, కేసీఆర్ ప్రభుత్వాల్లో పోచారం మంత్రిగా వ్యవహరించారు. అసలు రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటి? ఎందుకు పోచారానికి సంప్రదించారనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిగా మారింది.