Homeహైదరాబాద్latest NewsBREAKING: లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లా.. ఓం బిర్లా నేపథ్యం ఇదే..!

BREAKING: లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లా.. ఓం బిర్లా నేపథ్యం ఇదే..!

లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా రెండోసారి ఎన్నికయ్యారు. మూజువాణి ఓటుతో ఆయన గెలిచినట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ బుధవారం ప్రకటించారు. అనంతరం ఓం బిర్లాను స్పీకర్ ఛైర్ వద్దకు ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీసుకెళ్లారు. ఆయనకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. రాజస్థాన్‌లోని కోటా నియోజకవర్గం నుంచి ఓం బిర్లా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

స్పీకర్‌గా ఓం బిర్లా రికార్డ్
లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లా సరికొత్త రికార్డు నమోదు చేశారు. వరుసగా రెండోసారి స్పీకర్ చైర్‌ను అధిరోహించిన సభ్యుడిగా రికార్డులకు ఎక్కారు. ఆయన 2019లో తొలిసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కానీ 2024లో మాత్రం ఇండియా బ్లాక్ అభ్యర్థి కే సురేష్‌పై మూజువాణి ఓటుతో మరోసారి స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు.

ఓం బిర్లా నేపథ్యం ఇదే
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా 1962 నవంబర్ 23న రాజస్థాన్‌లోని కోటాలో జన్మించారు. ఆయన విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. తొలిసారి1991లో BJYM రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. ఇక 2014 నుంచి కోట లోక్ సభ స్థానాన్ని కంచుకోటగా మార్చుకున్నారు. మూడుసార్లు ఎంపీగా గెలవడంతో పాటు 2019, 2024లో లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.

Recent

- Advertisment -spot_img