కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. కింది కోర్టు ఉత్తర్వులు కొట్టివేయాలన్న ఆయన పిటిషన్ ను తిరస్కరించింది. లగచర్ల ఘటనలో తనపై నమోదైన కేసను కొట్టేయాలని కోరుతూ నరేందర్రెడ్డి ఇటీవల క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని హైకోర్టు కొట్టివేయడంతో పాటు.. మెరిట్స్ ఆధారంగా బెయిల్ పిటిషన్ను పరిశీలించాలని కిందికోర్టును ఆదేశించింది.