నేడు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ హైదరాబాద్ నగర కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు మినహా కార్పొరేటర్లు అందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా రేపటి కౌన్సిల్ సమావేశానికి కార్పొరేటర్లు, నగర ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరుకావాలని అధిష్టానం ఆదేశించింది. రేపు జరిగే కౌన్సిల్ సమావేశంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతలపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు కౌన్సిల్ సమావేశానికి హాజరుకావాలని అధిష్టానం ఆదేశించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి