Bumrah : పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ అభిమానులకు శుభవార్త… స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి వచ్చేసాడు. ఈ విషయాన్ని ముంబై ఫ్రాంచైజీ ప్రకటించింది. వెన్నునొప్పి కారణంగా ఐపీఎల్ కు దూరమైన బుమ్రా.. ప్రారంభ మ్యాచ్ల్లో ఆడలేదు. ఏప్రిల్ 7న వాంఖడేలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్లో బుమ్రా బరిలోకి దిగే అవకాశం ఉంది. సరైన బౌలర్ లేకపోవడంతో ఈ ఐపీఎల్ సీజన్లో టీమిండియా ఘోరంగా ఇబ్బంది పడుతోంది. ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడగా, 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో బుమ్రా రాక అభిమానులను ఆనందపరుస్తోంది.