Homeసినిమాసంక్రాంతి బరిలో ‘కెప్టెన్ మిల్లర్’

సంక్రాంతి బరిలో ‘కెప్టెన్ మిల్లర్’

ధనుష్ హీరోగా అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‘కెప్టెన్ మిల్లర్’. ఈ మూవీలో సందీప్ కిషన్, శివరాజ్ కుమార్ కీలక పాత్రలు చేస్తుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్​గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్, ఫస్ట్ సాంగ్ అందరినీ ఆకట్టుకోగా.. ఈ మూవీ టీమ్​ నుంచి థియేట్రికల్ ట్రైలర్​ను రిలీజ్​ చేయనున్నట్లు గురువారం ధనుష్ ట్విట్టర్​లో ప్రకటించాడు. అదే విధంగా సంక్రాంతికి పక్కాగా థియేటర్స్ లో ఉంటుందని తన పోస్ట్ లో తెలిపాడు. నివేదితా సతీశ్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ ఫేం ఎడ్వర్డ్‌ సొన్నెన్‌బ్లిక్ తదితరులు ఈ మూవీలో ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తుండగా జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నాడు. సత్య జ్యోతి ఫిలిమ్స్‌ గ్రాండ్​గా తెరకెక్కిస్తున్న కెప్టెన్‌ మిల్లర్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Recent

- Advertisment -spot_img