గుంటూరు: ఈ నెల 15 తర్వాత ఆయా రాష్ట్రాలు విద్యా సంస్థలను తెరచుకోవచ్చని, నిర్ణాయాధికారం రాష్ట్రాలకు అప్పగించింది.
కరోనా సమయంలో స్కూల్స్ ఓపెన్ అయితే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో గుంటూరు సంఘటన తెలియజేసింది.
గుంటూరు జిల్లా పరిధిలోని సత్తెనపల్లి మండలం భట్లూరులో 30 మంది చిన్నారులకు ఒకేసారి కరోనా సోకడం కలకలం సృష్టించింది.
పిల్లలకు ట్యూషన్ చెప్పె క్రమంలో ఒకరి నుంచి మరోకరికి సోకినట్లు ప్రాథమికంగా వైద్యాధికారులు నిర్ధారించారు.
అయితే ఆ గ్రామంలో ఒకేరోజు 39 కరోనా పాజిటివ్ కేసులు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ట్యూషన్ చెప్పే టీచర్కు కరోనా సోకడంతో ఆయన ద్వారా పిల్లలకు కరోనా సోకినట్లు తేలింది.
ఆయా స్టూడెంట్స్ ద్వారా వారి పేరెంట్స్ కు కరోనా సోకినట్లు పరీక్షల్లో తేలింది.
ఆ ట్యూషన్లో మొత్తం 50మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. కరోనా బారినపడిన విద్యార్థులంతా ఏడేళ్లలోపు వారే కాగా..
వారందర్ని గుంటూరు క్వారంటైన్కు తరలించారు. తల్లిదండ్రుల్ని మాత్రం హోం ఐసోలేషన్లో ఉన్నారు.
దీంతో మేలుకున్న అధికారులు కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్నారు. గ్రామాల్లో ఎవరైనా ట్యూషన్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
A simultaneous corona infection has affected 30 children in Bhatlur, Sattanapalli mandal under Guntur district. The paramedics basically