YCP హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై NTR జిల్లా నందిగామలో జరిగిన రాళ్లదాడి కేసులో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 2022 నవంబర్ 5న నందిగామలో వాహనంపై అభివాదం చేస్తూ చంద్రబాబు వస్తుండగా వీధి లైట్లు ఆర్పివేసి రాళ్ల దాడి చేశారు. నందిగామకు చెందిన కనికంటి సజ్జన్రావు, బెజవాడ కార్తీక్, పరిమి కిశోర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.