HomeజాతీయంCentral Government : ఉక్రెయిన్, జహంగీర్‌పురిపై వార్తలు ప్రసారం చేసేటప్పుడు జాగ్రత్త

Central Government : ఉక్రెయిన్, జహంగీర్‌పురిపై వార్తలు ప్రసారం చేసేటప్పుడు జాగ్రత్త

Central Government : ఉక్రెయిన్, జహంగీర్‌పురిపై వార్తలు ప్రసారం చేసేటప్పుడు జాగ్రత్త

Central Government : జహంగీర్‌పురి హింస, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి సంబంధించిన వార్తలు రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం వార్తా చానళ్లకు సూచించింది.

సంబంధిత చట్టాలకు కట్టుబడి ఉండేలా వాటి హెడ్‌లైన్స్ ఉండేలా చూసుకోవాలని హెచ్చరించింది.

ఇలాంటి సున్నితమైన అంశాలను ప్రసారం చేసేటప్పుడు వాటి శీర్షికలు, ట్యాగ్‌లైన్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

వాయవ్య ఢిల్లీలో జరిగిన ఘటనలకు సంబంధించి టీవీ చానళ్లలో చర్చలు అన్‌పార్లమెంటరీగా, రెచ్చగొట్టేలా ఉన్నాయని, సామాజికంగా ఆమోదయోగ్యం కాని భాషను ఉపయోగించారని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ పేర్కొంది.

అంతేకాదు, జహంగీర్‌పురి హింసాత్మక ఘటన విచారణకు మీడియా కవరేజీ ఆటంకం కలిగిస్తోందని కూడా పేర్కొంది.

Toll Free Route : టోల్​ గేట్స్​ లేని ‘ఫ్రీ రూట్స్’​ కావాలా..?

Payment Apps : గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్‌లు డబ్బు ఎలా సంపాదిస్తాయి?

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఊరేగింపు సందర్భంగా జహంగీర్‌పురిలో రాళ్లు రువ్వినట్టు ఆరోపణలు రావడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే.

పై ఘటనలకు సంబంధించి కంటెంట్‌ను ప్రసారం చేసే పద్ధతిలో టీవీ చానళ్లు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్న తీరుపై ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు మంత్రిత్వశాఖ జారీ చేసిన అడ్వైజరీలో పేర్కొంది.

కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (రెగ్యులేషన్) చట్టం 1995లోని పైన పేర్కొన్న నిబంధనలను ఉల్లంఘించే ఏదైనా కంటెంట్‌ను ప్రచురించడం, ప్రసారం చేయడం నుండి తక్షణమే దూరంగా ఉండాలని అందులో హెచ్చరించింది.

కాగా, జహంగీర్‌పురి హింసకు సంబంధించిన కేసును ఢిల్లీ పోలీస్ ప్రత్యేక సెల్ దర్యాప్తు చేస్తోంది.

Egg Side Effect : గుడ్డు మంచిదని ఎక్కువ తింటున్నారా..? అయితే డేంజ‌రే..

Apple : రోజుకో ఆపిల్‌తో జీర్ణ స‌మ‌స్య‌లకు చెక్‌

Recent

- Advertisment -spot_img