బీజింగ్: చైనా తన తీరును మార్చుకోవడం లేదు. కరోనా వైరస్ గురించి ప్రపంచం ముందు నిజాలు దాచిపెట్టిన చైనా తాజాగా వ్యాక్సిన్ తయారీలోనూ దొంగరీతిగా వ్యవహారిస్తోంది. వరల్డ్ మీడియా కథనాల ప్రకారం.. చైనాలో లక్షల మందికి అనధికారికంగా కరోనా వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఈ వ్యాక్సిన్లు వేసుడు జూన్ నుండే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ కారణంగా చాలా మందిలో దుష్ప్రభావాలు తలెత్తినట్లు ఆ కథనాల సారంశం. ఈ చర్యలను చైనా అధికారులు సమర్థించుకుంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించచిన ‘అత్యవసర వినియోగ’ నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పడం గమనార్హం.
వ్యాక్సిన్ తయారీలో నిమగ్నం అయిన కంపెనీలు ‘అత్యవసర వినియోగం’ పేరుతో వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాకుండానే తమ ఉద్యోగులు, వాకి కుటుంబ సభ్యులకు ఇస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని సినోఫార్మ్కు చెందిన ‘సీఎన్బీజీ’.. సుమారు 3.5 లక్షల మందికి ఈ టీకాను ఇచ్చింది. మరో సంస్థ సినోవ్యాక్.. తన ఉద్యోగులు, కుటుంబ సభ్యుల్లో 90 శాతం మందికి వ్యాక్సిన్ను ఇచ్చింది. చైనా సైన్యం, కానాసినో అనే ఔషధ సంస్థ సంయుక్తంగా రూపొందిస్తున్న వ్యాక్సిన్ను సైనిక సిబ్బందికి ఇస్తున్నారు.
‘అత్యవసరం’ సాకుగా లక్షల మందికి వ్యాక్సిన్లు వేస్తున్నరు
RELATED ARTICLES