న్యూఢిల్లీ: నాటకీయ పరిణామాల మధ్య చెస్ ఒలింపియాడ్ ఫైనల్లో ఇండియా గోల్డ్ మెడల్ సాధించింది. కరోనా నేపథ్యంలో తొలిసారి ఆన్లైన్ వేదికగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ ఫైనల్లో రష్యాతో కలిసి గోల్డ్ మెడల్ని పంచుకోవాల్సి వచ్చింది. రష్యాతో జరిగిన ఫైనల్లో భారత్ చెస్ మాస్టర్స్ నిహల్ సరిన్, దివ్యా దేశ్ ముఖ్లు హోరాహోరిగా పోరాడుతున్న సమయంలో సర్వర్ డౌన్ అయ్యింది. దీంతో వారు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. నిరాశకు గురైనా వీరు స్పోర్ట్ అథారీటికి జరిగిన టెక్నికల్ ఇష్యూస్ను వివరించారు. భారత అధికారులు ఫిడేకు అప్పీల్ చేయడంతో రెండు జట్లను విజేతలుగా ప్రకటించారు. నిహాల్ సరీన్, దివ్య దేశ్ముఖ్లు గెమ్ ఆడుతున్న సమయంలో సర్వర్ అంతరాయాల కారణంగా పత్యర్ధి ఎసిపెంకోతో గేమ్ను డ్రా చేసుకొనే పరిస్థితుల్లో ఉన్న నిహల్ సరీన్ ఓటమి చెందారు. షువలోవాతో జరిగిన మరో మ్యాచ్లో కూడా సాంకేతిక సమస్య కారణంగా దివ్వ దేశ్ముఖ్ కూడా ఓటమి పాలైంది. కోనేరు హంపి కూడా వీరి తరహలోనే టేక్నికల్ సమస్యలు ఎదురుకున్నారు. ఈ కారణంగా భారత ఆటగాళ్ళు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
చెస్ ఒలింపియాడ్ ఫైనల్.. సర్వర్ డౌన్.. ఓడి గెలిచిన ఇండియా
RELATED ARTICLES