Chhattisgarh : ఛత్తీస్గఢ్లో (Chhattisgarh) భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని గంగులూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతిచెందారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ప్రస్తుతం మావోయిస్టులు మరియు భద్రతా దళాల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.