Homeహైదరాబాద్latest News‘మార్‌ ముంతా’ పాట పై ఆసక్తికర వ్యాఖలు చేసిన మణిశర్మ.. ఏమన్నారంటే?

‘మార్‌ ముంతా’ పాట పై ఆసక్తికర వ్యాఖలు చేసిన మణిశర్మ.. ఏమన్నారంటే?

రామ్‌ పోతినేని-పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. కావ్యా థాపర్‌ కథానాయిక. ఆగస్టు 15న ఈ మూవీ విడుదలకానుంది. ఇటీవల సినిమా నుంచి ‘మార్‌ ముంతా ఛోడ్‌ చింతా’ అనే మాస్‌ పాటను మేకర్స్ విడుదల చేశారు. మణిశర్మ సంగీత దర్శకత్వంలో రాహుల్‌ సిప్లిగంజ్‌ దాన్ని ఆలపించారు. తాజాగా ఈ పాటకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు వీళ్లిద్దరూ పంచుకున్నారు.
ఈ సందర్భంగా మణిశర్మ చాలామంది ఈ పాటను ఐటెం సాంగ్‌గా భావిస్తారు. కానీ, ఇది ది డ్యూయెట్‌ సాంగ్ అని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్ ఆధారంగా మేము దాని సాహిత్యాన్ని వ్రాసామని తెలిపారు. కేసీఆర్ అంటే మా అందరికీ గౌరవం అని చెప్పారు. ఇందులో ఆయన సరదా గా వాడిన ఓ మాటని సాంగ్‌ లో తీసుకున్నాము. ఆంటే గాని మేము ఎవరినీ బాధపెట్టాలని అనుకోలేదని తెలిపారు. నా 27 ఏళ్ల కెరీర్‌లో ఎవరినీ నొప్పించలేదు. ఈ పాటలో ఒక్కసారి కేసీఆర్ తలచుకున్నాం అని తెలిపారు. దయచేసి అందరూ అలాగే భావించండి. ఇది కేవలం వినోదం కోసమే మణిశర్మ అని అన్నారు.

Recent

- Advertisment -spot_img