ఇదేనిజం, శేరిలింగంపల్లి:శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ జగదీశ్వర్ గౌడ్ తన జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి,ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా సీఏం రేవంత్ రెడ్డి ,డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలు జగదీశ్వర్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ,ఆరోగ్యకరమైన జీవితంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని జగదీశ్వర్ గౌడ్ కు వారు సూచించారు.