Homeహైదరాబాద్latest Newsమాజీ మంత్రి నర్సారెడ్డి మృతి పట్ల సీఎం రేవంత్‌ సంతాపం

మాజీ మంత్రి నర్సారెడ్డి మృతి పట్ల సీఎం రేవంత్‌ సంతాపం

ఇదేనిజం, హైదరాబాద్​: మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ నేత పీ నర్సారెడ్డి మృతి పట్ల సీఎం రేవంత్​ రెడ్డి సంతాపం తెలిపారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ప్రజలకు ఆయన అనేక సేవలందించారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. నర్సారెడ్డి అనుభవాలు తమకు మార్గదర్శకంగా ఉండేవని, ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నర్సారెడ్డి.. సోమవారం తెల్లవారుజామున తుది శ్వాసవిడిచారు. 1931, సెప్టెంబర్ 22న నిర్మల్ పట్టణంలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఏ, ఎల్ఎల్‌బీ పట్టాలు పొందారు. వృత్తి రీత్యా న్యాయవాది అయిన ఆయన.. నిజాం నిరంకుశ పరిపాలన నుంచి హైదరాబాద్‌ విముక్తి కోసం పోరాడారు.

Recent

- Advertisment -spot_img