వామపక్ష పార్టీ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమ్యారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు అంటూ మాట మార్చారు. కొడంగల్లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. సొంత నియోజకవర్గ ప్రజలను నేనెందుకు ఇబ్బంది పెడతానన్న రేవంత్ రెడ్డి అన్నారు. తన నియోజకవర్గంలోని యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే తన ఉద్దేశం అని సీఎం తెలిపారు.