Homeహైదరాబాద్latest Newsసీఎం రేవంత్ రెడ్డి అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

సీఎం రేవంత్ రెడ్డి అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

ఫార్ములా-ఈ కేసుపై బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఫార్ములా-ఈ కేసు విషయంలో నేను మొదటి రోజు చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నా.. ప్రభుత్వ నిర్ణయంగా ఒక మంత్రిగా నిర్ణయం తీసుకున్న అదే మాటకు నేను కట్టుబడి ఉన్నాను అని కేటీఆర్ త్తెలిపారు. అవినీతి జరగనే లేనప్పుడు.. అవినీతి నిరోధక శాఖ పేరుతో కేసులు పెడుతుంది అని పేర్కొన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టిన న్యాయపరంగా ఎదుర్కొంటా అని తెలిపారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిన మాటల్లోనే అవినీతి జరగలేదని చెప్పారు.. అవినీతి ఎక్కడ ఉందని ముఖ్యమంత్రినీ అడిగితే చెప్పలేని పరిస్థితి ఉంది కేటీఆర్ వ్యాఖ్యానించారు. సీఎం ఫార్ములా ఈ ప్రతినిధులతో కలిసిన ఫోటో బయట పెట్టడంతో.. సీఎం రేవంత్ రెడ్డి అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని ఆరోపించారు. మరి ఫార్ములా ఈ వాళ్లతో కలిసిన రేవంత్ రెడ్డి.. వాళ్లపైన ఎందుకు కేసు పెట్టలేదు అని కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్ పేరు ప్రతిష్ట తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు హైదరాబాద్ నుంచి ఫార్ములా ఈ రేసు పోవద్దన్న ఉద్దేశంతోనే డబ్బులు కట్టాం అని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక్క రూపాయి అవినీతి కూడా జరిగే అవకాశమే లేదు అని అన్నారు. ఈడి నోటీసులు వచ్చిన మాట వాస్తవమే.. ఇతర కేసుల్లో మాదిరి కాకుండా ఈ కేసులో ఈడి దూకుడుగా వ్యవహరిస్తుంది అని కేటీఆర్ తెలిపారు.

Recent

- Advertisment -spot_img