తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సచివాలయంలో భారీగా బదిలీలు జరగనున్నాయి. ఒక్కసారిగా 177 మంది సెక్షన్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ శుక్రవారం సీఎస్ శాంతికుమారి జీవో విడుదల చేశారు. త్వరలో మరికొంత మందిని కూడా బదిలీ చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే లీకులను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.