Homeతెలంగాణబాండ్ల పేపర్ల పేరుతో కాంగ్రెస్​ డ్రామా

బాండ్ల పేపర్ల పేరుతో కాంగ్రెస్​ డ్రామా

– వాళ్ల మొసలి కన్నీళ్లు నమ్మితే కన్నీరే
– గల్ఫ్​ కార్మికులను ఆదుకొనేందుకు కొత్త స్కీమ్​
– బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: బాండ్ల పేరుతో కాంగ్రెస్​ పార్టీ కొత్త డ్రామా చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కాంగ్రెస్ లీడర్ల మొసలి కన్నీళ్లు నమ్మితే కన్నీళ్లు మిగులుతాయని చెప్పారు. తాము ఈ పదేండ్లలో ఎంతో అభివృద్ధి చేశామని.. భవిష్యత్​ లో మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. గల్ఫ్​ కార్మికులను ఆదుకొనేందుకు కొత్త స్కీమ్​ తీసుకొస్తామని చెప్పారు. బీఆర్ఎస్​ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం, పరిశ్రమలు, ఇళ్లకు 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నామని చెప్పారు. ఈ పదేళ్లలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశామని.. మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. నిజామాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. ‘బీఆర్ఎస్​ ప్రభుత్వం వచ్చాక 2.30లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం.’ అని కవిత అన్నారు.

Recent

- Advertisment -spot_img