Homeహైదరాబాద్latest Newsహామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: ఆడెపు రవీందర్

హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: ఆడెపు రవీందర్

ఇదేనిజం, ముస్తాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం బీజేపీ మండల అధ్యక్షులు మెరుగు అంజా గౌడ్ ఆధ్వర్యంలో మండల ఆర్యవైశ్య గార్డెన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పార్లమెంట్ కో కన్వీనర్ ఆడేపు రవీందర్ విచ్చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంత గౌడ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి మండలంలోని పార్టీ కార్యకర్తలకు దిశ దశ నిర్దేశించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సహకరించి గ్రామాలలో ప్రజా సమస్యలపై ప్రతి కార్యకర్త పాటుపడాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన 8 నెలలు గడుస్తున్న మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500, ఆసరా పెన్షన్ 3000, రైతులకు రైతుబంధు అనేక హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని ఆయన అన్నారు. అనంతరం ముఖ్యఅతిథిగా వచ్చిన నాయకులను శాలువలతో సన్మానించారు. బీజేపీ మండల అధ్యక్షులు మెరుగు అంజా గౌడ్ పార్లమెంట్ కో కన్వీనర్ ఆడెపు రవీందర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంత గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్ల గిరిధర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బాద నరేష్, సౌల్ల క్రాంతి, వివిధ మోర్చా అధ్యక్షులు కుడుకల జనార్ధన్, మహిళా అధ్యక్షురాలు బుచెల్లి మహేశ్వరి, మాజీ ఎంపిటిసి పద్మ, చిగురు వెంకన్న, బీజేపీ నాయకులు శ్రీనివాసరావు, రమేష్ రెడ్డి, ఎదునూరి గోపి, కోళ్ల కృష్ణ, కస్తూరి కార్తీక్, బాల్ రెడ్డి, వివిధ గ్రామాల బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img