Homeజిల్లా వార్తలుCongress తోనే పేదల సంక్షేమం

Congress తోనే పేదల సంక్షేమం

ఇదేనిజం, జగదేవపూర్: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయని కాంగ్రెస్ మండల పార్టీ సీనియర్ నాయకులు కొండయ్య అన్నారు. సోమవారం ఆయన జగదేవపూర్ లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నెలలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల అమలకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు తీసుకోవడం జరిగిందన్నారు. 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీ అమలను చేసి చరిత్ర సృష్టించడం జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగలేదని పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వమే అండగా ఉంటుందని వారి అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకురావడం జరుగుతుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేపట్టారని అలాగే మిగతా పథకాలని అమలు చేస్తారన్నారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టడం అభినందనీయమని కొనియాడారు.

Recent

- Advertisment -spot_img