Homeఫ్లాష్ ఫ్లాష్నీళ్లు అడిగిన కరోనా పేషెంట్​.. కొట్టిచంపిన హాస్పిటల్​ సిబ్బంది

నీళ్లు అడిగిన కరోనా పేషెంట్​.. కొట్టిచంపిన హాస్పిటల్​ సిబ్బంది

రాజ్​కోట్​: కరోనా కాలంలో మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతుంది. కనీసం సాటి మనిషి అన్న సృహ కూడా వైద్య సిబ్బందిలో ఉండటం లేదనిపిస్తోంది. తాగేందుకు మంచినీళ్లు అడిగిన పాపానికి హాస్పిటల్​ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది కలిసి కరోనా పేషెంట్​ని కొట్టిచంపారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో హల్​చల్​ చేస్తోంది. 10 రోజుల ముందు జరిగిన ఈ సంఘటన గుజరాత్​లోని రాజ్​కోట్​లో జరిగింది. రాజ్​కోట్​లోని ఓ ప్రైవేట్​ కంపెనీలో పనిచేసే ప్రభాకర్​ పాటిల్ రెండు వారాల క్రితం ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో​ కిడ్నీఆపరేషన్​ చేయించుకున్నాడు. ఈ క్రమంలో కరోనా బారీన పడ్డాడు. దాంతో సెప్టెంబర్​ 8న రాజ్​కోట్​ కోవిడ్​ ఆస్పత్రిలో చేరాడు. అక్కడ కనీసం తాగేందుకు మంచి నీళ్లు కూడా లేకపోవడంతో నర్సింగ్​ సిబ్బందిని అడిగాడు. దాంతో కోపోద్రోక్తులైన నర్సింగ్​ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బందితో కలిసి ప్రభాకర్​ మీద దాడి చేశారు. ఎవరో దీన్ని వీడియో తీయడంతో అది వైరల్​ అయింది. మరో విచారకర విషయం ఏంటంటే దేబ్బలకు తాళలేక ప్రభాకర్​ సెప్టెంబర్ 12న మరణించినట్లు అతని సోదరుడు విలాస్​ పాటిల్​ మీడియాకు తెలిపాడు. కరోనా ప్రోటోకాల్​ ప్రకారం తనకి అంత్యక్రియలు కూడా చేయలేదని, బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విలాస్​ డిమాండ్​ చేస్తున్నాడు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img