Homeఫ్లాష్ ఫ్లాష్అధిక బరువున్న పిల్లలకు థర్ట్‌వేవ్‌ డేంజర్​

అధిక బరువున్న పిల్లలకు థర్ట్‌వేవ్‌ డేంజర్​

కరోనా కారణంగా అందరూ ఏడాదిగా ఇండ్లకే పరిమితవడంతో చాలామందిలో ఒబెసిటీ సమస్య పెరిగింది.

ఇలాంటివారికి, ముఖ్యంగా 12 ఏండ్లలోపు వయసున్న పిల్లలు థర్డ్‌ వేవ్‌లో కొవిడ్‌ బారిన పడే ముప్పు ఎక్కువగా ఉన్నదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని, పిల్లలకు వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ వేయించాలని సూచిస్తున్నారు.

కొంప ముంచుతున్న జంక్‌ఫుడ్‌

కరోనాతో ఇంటికే పరిమితమైన పిల్లలు స్నేహితులకు దూరంగా ఉండటం, స్కూల్‌ యాక్టివిటీస్‌ లేకపోవడంతో బద్ధకస్తులుగా మా రుతున్నారు.

స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌ టాప్‌లతో కాలం గడుపుతూ మానసిక ఒత్తిడిలోకి వెళ్లిపోతున్నారు.

తల్లిదండ్రులు పట్టించుకోకపోవ డంతో పిల్లలు జంక్‌ఫుడ్‌కు అలవాటుపడి బరువు పెరిగిపోతున్నారు.

కొవిడ్‌కు గురైతే తీవ్ర పరిణామాలే..

అధిక బరువుండే పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందని బెంగళూరులోని ఎంఎస్‌ రామయ్య హాస్పిటల్‌ చిన్నపిల్లల విభాగం సీనియర్‌ వైద్యుడు డాక్టర్‌ సోమశేఖర్‌ తెలిపారు.

ఇలాంటి పిల్లల్లో శ్వాస సంబంధ సమస్యలు ఎక్కువగా ఉం టాయని వివరించారు.

చాలామందికి చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులు వస్తున్నాయన్నారు.

వారికి కరోనా వస్తే పరిణామం తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

జంక్‌ఫుడ్‌కు దూ రంగా ఉండటం, ఆరోగ్యమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం ద్వారా బరువు తగ్గించుకోవడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చన్నారు.

Recent

- Advertisment -spot_img