HomeజాతీయంCorona Third Wave : భారత్​లో కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ గ్యారెంటీ

Corona Third Wave : భారత్​లో కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ గ్యారెంటీ

Corona Third Wave : భారత్​లో కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ గ్యారెంటీ

Corona Third Wave : కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తితో దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.

కొద్ది రోజుల వ్యవధిలోనే కేసులు ఊపందుకున్నాయి.

ఈ నేపథ్యంలోనే దేశంలో మూడో వేవ్‌ అనివార్యమని అనేక మంది భారతీయులు భావిస్తున్నారట.

వచ్చే మూడు నెలల్లో దేశంలో థర్డ్‌ వేవ్‌ వస్తుందని ముగ్గురిలో ఇద్దరు భారతీయులు భావిస్తున్నారని ఓ సర్వేలో తేలింది.

Immunity food : విజృంభిస్తున్న కొత్త‌ క‌రోనా.. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోండి ఈ ఆహారంతో..

immunity-boosting : ఈ 5 మార్గాలతో రోగనిరోధక శక్తి

లోకల్‌ సర్కిల్స్‌ (LocalCircles) అనే డిజిటల్ కమ్యూనిటీ ప్లాట్‌ఫాం దేశవ్యాప్తంగా నిర్వహించిన ఓ సర్వేలో ఈ ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

దేశవ్యాప్తంగా 377 జిల్లాల్లోని 37 వేల మందిపై ఓ సర్వే నిర్వహించినట్లు లోకల్‌ సర్కిల్స్‌ వెల్లడించింది.

ఇందులో 68 శాతం పురుషులు, 32 శాతం మహిళలు పాల్గొన్నట్లు తెలిపింది.

కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో నిధుల మంజూరుపై ప్రభుత్వం తక్షణం దృష్టిసారించాలని, ప్రతి జిల్లాలో ఆరోగ్య సిబ్బందిని నియమించాలని 81 శాతం మంది పౌరులు అభిప్రాయపడినట్లు పేర్కొంది.

Omicron Cases in India : దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్​ టెర్రర్​

Healthy Breakfast : ఉదయం ఇవి తింటే ఇక ఆరోగ్యం మీ చేతుల్లోనే

అంకితభావంతో పనిచేసే పిల్లల ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను ప్రతి జిల్లాలో ప్రారంభించాలని కోరినట్లు వెల్లడించింది.

ఈ సర్వేలో పాల్గొన్న ముగ్గురిలో ఇద్దరు దేశంలో కొవిడ్‌ మూడో దశ అనివార్యమన్నారు.

కాగా థర్డ్‌ వేవ్‌ తీవ్రత ‘చాలా అధికంగా’ ఉంటుందని వీరిలో 20 శాతం మంది అభిప్రాయపడగా.. 43 శాతం మంది ‘అధికంగా’ ఉంటుందన్నారు.

తీవ్రత తక్కువగానే ఉండనుందని 17 శాతం మంది పేర్కొనగా.. అసలు ఎలాంటి తీవ్రత ఉండబోదని 4 శాతం మంది వెల్లడించారు.

డిసెంబర్‌ మొదటి వారంలోనూ లోకల్‌ సర్కిల్స్‌ ఇదే తరహా సర్వే నిర్వహించింది.

అప్పుడు 38 శాతం మంది మాత్రమే మూడో వేవ్‌ వస్తుందని అభిప్రాయపడగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 63 శాతానికి చేరింది.

రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఏమీ చేయాలంటే..

Food in Hyderabad : హైదరాబాద్‌లో తప్పక టేస్ట్​ చేయాల్సిన ఫుడ్, అవి దొరికే…

Recent

- Advertisment -spot_img