– తనిఖీల పేరుతో ఓ వ్యక్తిని మోసం చేసిన దారి దోపిడి దొంగలు
– జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో ఘటన
ఇదే నిజం, హైదరాబాద్: పోలీసుల ముసుగుతో కొందరు దారి దోపిడి దొంగలు తనిఖీలు నిర్వహించి రూ.18.5 లక్షల క్యాష్తో పరారయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. సురేశ్ అగర్వాల్ అనే వ్యక్తి మెహదీపట్నంలో గత కొన్నేళ్లుగా క్లాత్ స్టోర్ను నడుపుతున్నారు. అతని దగ్గర పనిచేసే ప్రదీప్ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో రూ.20 లక్షల క్యాష్ను తీసుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో పోలీసు డ్రెస్లో ఉన్న కొందరు వ్యక్తులు జూబ్లీహిల్స్లోని ఓ హోటల్ సమీపంలో ప్రదీప్ కారును ఆపాడు. తనిఖీలు చేస్తున్నట్లుగా నటించాడు. ఆపై కారులో ఉన్న రూ.20 లక్షల్లో రూ.18.5 లక్షలు తీసుకుని. మిగతా రూ.1.5 లక్షలు అతని చేతిలో పెట్టి పరారయ్యారు. ప్రదీప్ ఇచ్చిన కంప్లయింట్ మేరకు పోలీసులు కేసుఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.