Homeక్రైంCrime News : పైసల కోసం సొంత పిల్లల్నే Kidnap చేశాడు

Crime News : పైసల కోసం సొంత పిల్లల్నే Kidnap చేశాడు

ఇదేనిజం, మహబూబ్​ నగర్​: డబ్బు కోసం సొంత పిల్లలనే కిడ్నాప్ చేసి విక్రయించాలనుకున్నాడు. భార్య ఫిర్యాదు చేయగా పోలీసుల అప్రమత్తతో అడ్డంగా బుక్కయ్యాడు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం నిమ్మబావి గడ్డలో జరిగింది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రఫీ తన ముగ్గురు పిల్లలను మాయ మాటలు చెప్పి బైక్ పై హైదరాబాద్ తీసుకెళ్లాడు. ఆ తర్వాత భార్యకు ఫోన్ చేసి పిల్లలను కిడ్నాప్ చేశానని తనకు డబ్బు కావాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో ఆమె వెంటనే జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు వెంటనే స్పందించి రఫీని హైదరాబాదులోని యాకుత్పురా వద్ద సహా నిందితుడు రఫీని పట్టుకుని పిల్లలను కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. రూ.9 లక్షలకు పిల్లల్ని బేరం కుదుర్చుకున్నాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా పోలీసుల అప్రమత్తతో కథ సుఖాంతమైంది. పిల్లలను విక్రయించాలనుకున్న తండ్రిని బంధువులు, కాలనీవాసులు దేహశుద్ధి చేశారు.

Recent

- Advertisment -spot_img