ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ రోజు అనగా జ్యేష్ఠ బహుళ అష్టమి శనివారం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానమునకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ముందుగా గోదావరి నదిలో స్నానం ఆచరించిన తదుపరి స్థానిక దైవమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని అలాగే అనుభంద దేవాలయములలో గల శ్రీ స్వామివార్లను అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.