చెన్నై: ఐపీఎల్ 20లో చెన్నై సూపర్ కింగ్స్ ఆపసోపాలు పడుతుంది. ఆ జట్టులో సురేశ్ రైనా లాంటి స్టార్ ఆటడాడు ఆడకపోవడం ఆ జట్టుకు కొంత లోటుగానే భావిస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో ఇప్పటికే ఇండియాకు తిరిగొచ్చిన రైనా ఐపీఎల్లో దాదాపుగా ఆడటనట్టేనని అందరూ భావిస్తున్నారు. అయితే ఇందుకు అతను తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని జట్టు యజమాని ఎన్.శ్రీనివాసన్ హెచ్చరించారు. కొందరు ఆటగాళ్లకు విజయం నెత్తికి ఎక్కిదంటూ ఎత్తిపొడిచాడు. జట్టుకు సమర్థుడైనా కెప్టెన్ ధోనితోపాటు అనేకమంది వర్ధమాన ఆటగాళ్లు ఉన్నారని శ్రీనివాసన్ అన్నారు. సీఎస్కేలో కొందరు ఆటగాళ్ల వ్యవహార శైలిపై ఆయన గుర్రుగా ఉన్నట్లు ఈ వ్యాఖ్యల తెలుస్తోంది. ఇదిలా ఉండగా దుబాయిలో తనకు కేటాయించిన హోటల్ గది నచ్చకపోవడంతోనే రైనా మేనేజ్మెంట్పై అలిగి ఇండియాకు వచ్చినట్లు కొన్ని వార్తలు నెట్టింట్లో హల్చల్ చేయడం గమనార్హం. ఇప్పటికే సీఎస్కే టీంలో 13 మందికి కరోనా పాజిటివ్ రావడం వారంతా క్వారంటైన్లో ఉండటం సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్లో టీం ఎలా రాణిస్తుందోనని సీఎస్కే అభిమానులు ఆందోళన చెందుతున్నారు.