ఓ చిన్న ఆలోచనతో ఎన్నో అద్భుతాలు చేయొచ్చని నిరూపించారు లండన్కి చెందిన అన్షు అహుజా, రెనీ విలియమ్స్. అచ్చం మన ముంబై డబ్బా వాలా మాదిరి ’డబ్బా డ్రాప్ టిఫిన్ సెంటర్‘తో రెస్టారెంట్ల నుంచి ఫుడ్ ఆర్డర్ చేయగా వచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు, ఆహారం వేస్ట్ ను కూడా అరికట్టారు. కస్టమర్ల ఇళ్ల నుంచి లేదా డెలివరీ బాయ్స్ ఇళ్లలో తయారు చేసిన ఆహారం డబ్బాలతో డెలివరి చేస్తున్నారు. 2018లో ప్రారంభమైన వ్యాపారం రూ. 21కోట్ల టర్నోవర్తో దూసుకుపోతోంది.