విశాఖపట్నం ఎయిర్పోర్టులో ప్రమాదకర బల్లులును కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్పోర్టులో డీఆర్ఐ, అటవీ సర్వీస్ అధికారుల సంయుక్త తనిఖీలు నిర్వహించారు. అయితే అక్రమంగా తరలిస్తున్న ప్రమాదకరమైన మూడు నీలి రంగు నాలుక బల్లులు, మూడు విదేశీ బల్లులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. థాయ్లాండ్ నుంచి అక్రమంగా బల్లులను భారత్కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత అటవీశాఖ అధికారులు వాటిని సంరక్షణ కోసం తరలించారు.