పీఎం కిసాన్ కింద అందించే వార్షిక సాయాన్ని రూ.6 వేల నుంచి రూ.12 వేలకు పెంచాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలను రైతు ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఫసల్ బీమా యోజన కింద సన్నకారు రైతులకు జీరో ప్రీమియంతో ఇన్సూరెన్స్ కల్పించాలని, వ్యవసాయ రుణాలపై వడ్డీ రేట్లను ఒక శాతానికి తగ్గించాలని కోరారు. తాజాగా జరిగిన సంప్రదింపుల సమావేశంలో నిర్మలకు రైతులు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పురుగుమందులపై జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గించాలని మంత్రికి ప్రతిపాదనలు వచ్చాయి.