Homeహైదరాబాద్latest Newsమర్రి రాజశేఖర్ ​రెడ్డి భవనాలు కూల్చివేత : Hyderabad

మర్రి రాజశేఖర్ ​రెడ్డి భవనాలు కూల్చివేత : Hyderabad

– అడ్డుకొనేందుకు యత్నించిన విద్యార్థులు..
– బఫర్​ జోన్​ లో రెండు శాశ్వత భవనాలు, 6 తాత్కాలిక భవనాలు
– 8.24 ఎకరాల చెరువును ఆక్రమించిన మర్రి రాజశేఖర్ రెడ్డి
– వారం క్రితమే యాజమాన్యానికి నోటీసులు

ఇదేనిజం, నేషనల్ బ్యూరో: బీఆర్ఎస్​ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన రెండు శాశ్వత భవనాలు, ఆరు తాత్కాలిక భవనాలను పోలీసులు ధ్వంసం చేశారు. హైదరాబాద్‌ శివారు దుండిగల్‌లోని చిన్న దామరచెరువు ఎఫ్‌టీఎల్‌ బఫర్‌ జోన్‌లో రాజశేఖర్‌రెడ్డికి చెందిన ఏరోనాటికల్‌, ఎంఎల్‌ఆర్‌ఐటీఎం కళాశాలలకు సంబంధించిన రెండు శాశ్వత భవనాలు, 6 తాత్కాలిక షెడ్ల కూల్చివేతలు ప్రారంభించారు. మొత్తం 8.24 ఎకరాల చెరువు (ఎఫ్‌టీఎల్‌ బఫర్‌ జోన్‌) ఆక్రమించి పార్కింగ్‌ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్లు నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు. ఈ మేరకు వారం క్రితం యాజమాన్యానికి నోటీసులిచ్చారు. తాజాగా మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు నీటిపారుదల, రెవెన్యూ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. దీన్ని అడ్డుకునేందుకు కొంత మంది విద్యార్థులు, కళాశాల సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వారికి అధికారులు సర్దిచెబుతున్నారు.

Recent

- Advertisment -spot_img