Homeహైదరాబాద్latest Newsఅర్హులైన ప్రతి ఒక్కరికి అభివృద్ధి పథకాలు: మంత్రి శ్రీధర్ బాబు

అర్హులైన ప్రతి ఒక్కరికి అభివృద్ధి పథకాలు: మంత్రి శ్రీధర్ బాబు

ఇదే నిజం, మంథని: మంథని మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి వర్యులు దుద్ధిల్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు తెలిపారు.ఎన్నికల కోడ్ ముగియగానే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి అభివృద్ధి పథకాలు అందుతాయన్నారు.

గడ్డం వంశీకృష్ణ ను పెద్దపెల్లి పార్లమెంటు ఎంపి గా భారీ మెజారిటీతో గెలిపించాలని బి.ఆర్.ఎస్,బీజేపీ పార్టీ నాయకుల మోసపూరిత హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని,రాహుల్ గాంధీ ఇచ్చిన పాంచ్ న్యాయలను అమలు చేసి తీరుతామని, ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుకు ఓటు వేసి గడ్డం వంశీకృష్ణ నీ గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. మంథని పలు వీధుల్లో ప్రచారం నిర్వహించిన మన ప్రియతమ మంత్రివర్యులు దుద్ధిల్ల శ్రీధర్ బాబు ఈ కార్యక్రమంలో గౌరవ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అన్ని అనుబంధ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img