Homeహైదరాబాద్latest Newsధనుష్ - ఐశ్వర్య విడాకుల కేసు..నేడు వెలువడనున్న తీర్పు..!

ధనుష్ – ఐశ్వర్య విడాకుల కేసు..నేడు వెలువడనున్న తీర్పు..!

ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ విడాకుల కోసం చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఈ పిటిషన్‌పై కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది.తమిళ సినీ హీరో ధనుష్ కి 2004లో సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యతో పెళ్లి జరిగింది. వీరిద్దరికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే 2022లో ధనుష్, ఐశ్వర్య తమ 18 సంవత్సరాల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. ఇద్దరూ విడాకులు కావాలని చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌లో తమ వివాహం శూన్యమని ప్రకటించాలని కోరారు.
ఈ పిటిషన్ మూడుసార్లు విచారణకు వచ్చినా ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ హాజరుకాకపోవడంతో విచారణ వాయిదా పడింది. దీంతో వీరిద్దరూ మళ్లీ జతకట్టబోతున్నారని ఫ్యాన్స్ సర్కిల్స్‌లో వార్తలు వచ్చాయి. అయితే నాలుగో విచారణలో ఇద్దరూ వ్యక్తిగతంగా హాజరయ్యారు. కోర్టు హాలులోనే ఇద్దరినీ విచారించారు.విడిపోవాలని నిశ్చయించుకున్నామని, ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదని వారిద్దరూ చెప్పడంతో ఈ కేసులో తీర్పును 27న వెలువరిస్తామని న్యాయమూర్తి ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. మరోవైపు ధనుష్ ఐశ్వర్య విడాకుల కేసులో చెన్నై కుటుంబ సంక్షేమ న్యాయస్థానం నేడు (నవంబర్ 27) తీర్పు వెలువరించనుంది.

Recent

- Advertisment -spot_img